అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి : కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ పిళ్ళా మంగమ్మ

అమరావతి రాజధానిని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి : కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబెర్ పిళ్ళా మంగమ్మ 

మధురవాడ : విశాఖ లోకల్ : జూన్ 08: 

అమరావతి రాజధానిని అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పీ.ఎం.పాలెం పోలీస్ స్టేషన్లో మధురవాడ మహిళలు, స్థానిక నేతలు ఫిర్యాదు చేసారు. 7వవార్డ్ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ ఆధ్వర్యంలో మధురవాడ ప్రాంత మహిళలు పిర్యాదు చేసారు. శుక్రవారం, సాక్షి ఛానల్ డిబేట్‌లో జర్నలిస్టు రాజు మరియు సాక్షి చీఫ్ కే. శ్రీనివాస్ అమరావతి వేశ్యల రాజధాని అంటూ చేసిన అసభ్య వ్యాఖ్యల పై చర్యలు తీసుకోవాలని 7వవార్డ్ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ భీమిలి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు బోయ రమాదేవి ఐదవ వార్డు మహిళా అధ్యక్షురాలు సరస్వతి ఆరో వార్డు మహిళా అధ్యక్షురాలు పెంటకోట బబేలు సునీత, వనిత, కంభపు కనకమ్మ, పతివాడ రవణమ్మ ఐదు ఆరు ఏడు వార్డుల మహిళలు తదితరులు పాల్గొన్నారు.