మిచాంగ్ తుఫాను ప్రభావంతో నేల వాలిన వరి,అరటి,బొప్పాయి, పెసలు,మినుములు రైతులను ఆదుకోవాలని విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ డిమాండ్

మిచాంగ్ తుఫాను ప్రభావంతో నేల వాలిన వరి,అరటి,బొప్పాయి, పెసలు,మినుములు రైతులను ఆదుకోవాలని విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ డిమాండ్:-

పద్మనాభం: వి న్యూస్ : డిసెంబర్ 07:

విశాఖ జిల్లాలో అనందపురం, పద్మనాభం భీమిలి రూరల్ మండలంలలో విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు,పి.వి వి.ప్రసాదరావు పట్నాయక్  గురువారం పర్యటించారు,ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ, కుశీలవాడ,బోని,బాకురపలెం శి ర్లపాలెం,ముకుందపురం, పద్మనాభం మండలంలో ఏనుగుల పాలెం,పాండ్రంగి,అనంతవరం,రెడ్డి పల్లి,చిన్న పురం కాకుండా ఈ మూడు మండలాల్లో పలు ప్రాంతాలలోని వరి,అరటి, బొప్పాయి రైతులను మిచాంగ్ తుఫాన్ నిలువునా ముంచేసింది అని తుఫాన్ ప్రభావంతో సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు వరి అరటి సహా కొన్నిచోట్ల పైకి లేచాయి. రాలిపోయాయి. పద్మనాభం మండలంలో చిన్న పురం లో పెసలు మినుములు పూర్తిగా నీటిలో మునిగాయని 90 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు చాలా చెట్లు నేలవాలాయి.ఈ తుఫాను ప్రభావంతో వరి రైతుల తుఫాను ప్రభాతంతో నేల మట్టం కావడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యింది. రైతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు,మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు,విశాఖ జిల్లా కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు సారిక ప్రకాశ్, ,విశాఖ జిల్లా కిసాన్ మోర్చ కార్యదర్శులు:- కలగళ్ళ పేర్రాజు,బుత్తల రాజు, మరియు మండల కిసాన్ మోర్ఛ నాయకులు పాల్గొన్నారు.