విశాఖ లో ఒకరితో ప్రేమ. మరొకరితో రహస్య వివాహం.
గోపాలపట్నం : వి న్యూస్ : ఆగష్టు 13:
ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ.*ఉరి వేసుకుని బాలిక, రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య అరెస్టయిన మరో యువకుడు మైనర్ సూసైడ్ కేసులో వీడిన మిస్టరీ.*
*గోపాలపట్నంలో మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒకరిని ప్రేమించి.. మరొకరిని వివాహం చేసుకున్న బాలిక.. తను చనిపోయి.. మరొకరి ప్రాణాలను బలిగొంది. వివాహం చేసుకున్న వాడి జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది.*
👉గోపాలపట్నం పోలీసులు తెలిపిన వివరాలివీ..*కొత్తపాలెం
నాగేంద్రకాలనీకి చెందిన బాలిక(16) ఇటీవల ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని
బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.
యువకులతో దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్ట గా.. పలు ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. నగరంలోని ఓ కళాశాలలో ఇం టర్ చదువుతున్న బాలికకు పలువురు పరిచయాలున్నాయి. ఆదర్శనగర్కు చెందిన సీపాన సూర్యప్ర కాషావుతో ప్రేమ వ్యవహారం నడిపిస్తూ.. ఇందిరానగర్కు చెందిన లెంకా సాయికు మార్ను రహస్యంగా వివాహం చేసుకుం ది. ఆమె సూర్యప్రకాష్తో చనువుగా ఉండ డంతో సాయికుమారు నచ్చలేదు. అలాగే సాయికుమార్తో చనువుగా వ్యవహరిం చడం సూర్యప్రకాషకు నచ్చలేదు. దీంతో వీరి ముగ్గురి మధ్య మనస్పర్థలు వచ్చాయి. బాలిక ఆత్మహత్యకు రెండు రోజుల ముందు ఆమె ఇంటికి ఇద్దరూ
వేర్వేరు సమయాల్లో వచ్చారు. ఇద్దరిలో ఎవరితో ఉంటావో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన ఆమె.. ఆత్మ హత్య చేసుకుంది. మృతురాలి తండ్రి సూర్య ప్రకాష్, సాయికుమార్లపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను ఒత్తిడికి గురి చేయడం వల్లే మరణించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలిసి ఆందోళన చెందిన సూర్యప్రకాష్ గోపాలప ట్నం ఆర్ఆర్ క్యాబిన్ వద్ద శుక్రవారం రైలు కింద పడి మృతి చెందాడు. శనివారం మృ తదేహాన్ని చూసిన అతని తల్లిదండ్రులు సూర్యప్రకాష్ గా గుర్తించారు. లంకా సాయికుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండకు తరలించారు.